వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటి వద్దకే పెన్షన్లు
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి ప్రతి నెల 1వ తేదీ వేకువజామున ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. శనివారం కమిషనర్ నరసింహాప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ చేశారు. అలాగే మండలంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి , ఎంపీడీవో రామనాథరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈకార్యక్రమాలలో వైస్ చైర్మన్లు సిఆర్.లలిత , నాగేంద్ర, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, కిజర్ఖాన్, నరసింహులు, మమతారాణి, రేష్మా, జయభారతి, భారతి, కమలమ్మ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర పంపిణీ చేశారు. వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్షరీఫ్, మహబూబ్బాషా, ఇంతియాజ్ఖాన్, గౌస్, లక్ష్మణ్రాజు , సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.

Tags: Pensions at home under YSRCP Govt
