Natyam ad

కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడంలేదు-మంత్రి హరీష్ రావు

పటాన్ చేరు ముచ్చట్లు:

ఆకలైనప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్కు ఓట్ల కోసం గోరుముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మరని మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై మండిపడ్డారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు  నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మైనార్టీ బంధు  , బీసీ బంధు లబ్ధిదారుల తోపాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేసారు.
ఆదేవిధంగా జి వో నంబర్ 58,59 ద్వారా లబ్ధిదారుల కు రెగ్యులైజేషన్ మంజూరు  పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి,పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా కలాక్టర్ శరత్,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

Post Midle

ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రం లో అభివృద్ధి  పండుగ జరగుతుంది. నిన్న ఒకేసారి  9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించాము ఈరోజు పాలమూరు ప్రాజెక్ట్ ను  సీఎం కెసిఆర్ ప్రారంభిస్తున్నారు.  ఎలాంటి షరతులు లేకుండా ఒక రూపాయి అప్పు లేకుండా నేరుగా లక్ష రూపాయలు బీసీ బంధు  కింద ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు అని అన్నారు.
వర్గాలను అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్  బీసీ బందు పథకాన్ని అమలు చేస్తున్నాను. బీసీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రికి కేసీఆర్  చేపట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది.మైనార్టీల సంక్షేమం  పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.మైనార్టీలు సురక్షితంగా ఉన్నారంటే అది తెలంగాణలోనే బిజెపి పాలిత ప్రాంతంలో మైనార్టీలు అభద్రత భావంతో ఉన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనార్టీ సంక్షేమంతో పాటు మైనార్టీ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలను కళాశాలలను ప్రారంభించారు.

 

 

కర్ణాటకలో ముస్లిం మైనార్టీలు 90 లక్షల మంది ఉన్నారు. మహారాష్ట్రలో కోటి 50 లక్షల మంది ఉన్నారు. బెంగాల్ లో  రెండు కోట్ల 55 లక్షల మంది అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్లో నాలుగు కోట్ల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో 2 వేల కోట్లకు మించి ముస్లిం మైనార్టీల కోసం బడ్జెట్ కేటాయించలేదు. అదే తెలంగాణ లో 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఉంటే వారి కోసం రెండు వేలకోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎంత  కట్టుబడి ఉన్నారనేది ఆలోచించండని అన్నారు. హిందువులైనా, ముస్లింలైనా  అందరికోసం పనిచేసే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మాదిరి  పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ పథకం ఇస్తలేదు. ఇప్పటి వరకు 12 లక్షల 71,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 11 వేల 130 కోట్లు ఇప్పటివరకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్లకు రాష్ట్ర ప్రభుత్వం  అందించింది.

 

 

 

చత్తిస్ గడ్ ,  ఒడిశా రాష్ట్రాల కరెంటు వాడకం కంటే హైదరాబాద్ కరెంటు వాడకం ఎక్కువ.  తెలంగాణ రాకముందు హైదరాబాద్లో 2000 మెగావాట్ల వినియోగంలో ఉంటే  ఈరోజు 6000 మెగావాట్లు పెరిగిందని అన్నారు. నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన కరెంటును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే.మెట్రో రైల్ కూడా తొందర్లో పటాన్ చెరు  వరకి రానుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్  పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించారు. మళ్లీ పటాన్చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి ని గెలిపించాలి. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆశీర్వదించాలి. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేయడం చేతకాలేదు ఇప్పుడు చేస్తామంటే నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఆకలైనప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్కు అవసరానికి గోరిముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణకు మించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చూపించాలని మంత్రి అన్నారు.

 

Tags: People do not trust Congress – Minister Harish Rao

Post Midle