పుంగనూరులో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి -సీనియర్ సివిల్జడ్జి వాసుదేవరావు
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజలందరు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అలవర్చుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయాలని సీనియర్ సివిల్జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పిహెచ్సీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి రోజు ప్రతి ఒక్కరు వ్యాయమం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అలాగే నాణ్యమైన ఆహారపదార్థాలతో పాటు ఆకు కూరలు తీసుకోవాలని , కొవ్వు పదార్థాలను తగ్గించుకోవడం , ప్రతి రోజు కాలినడక న ప్రయాణించడం అలవర్చుకోవాలన్నారు. దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గల్లా శివశంకర్నాయుడు, కార్యదర్శి కెవి.ఆనంద్కుమార్, న్యాయవాదులు వీరమోహన్రెడ్డి, హరినాథరెడ్డి, రవీంద్రనాథ్, సమివుల్లా తో పాటు డాక్టర్ బాలసాయిరెడ్డి పాల్గొన్నారు.
Tags: People should be perfectly healthy in Punganur – Senior Civil Judge Vasudeva Rao