పుంగనూరులో పోలీసుల కవాతు
పుంగనూరు ముచ్చట్లు:
రాబోవు ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని , ఓటర్లకు అండగా మేము ఉంటామని భరోసా కల్పిస్తూ పలమనేరు డిఎస్పీ మహేశ్వరర్రెడ్డి ఆధ్వర్యంలో సీఐ రాఘవరెడ్డి పోలీస్ కవాతు నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించి ఓటర్లకు భరోసా కల్పించారు. సీఐ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలిగిన తమకు సమాచారం అందించాలని కోరారు.
Tags; Police parade in Punganur