సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత
-శని,అది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టిటిడి
తిరుమల ముచ్చట్లు:
సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖల పై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. విఐపిల కోసం కేటాయించిన సమయాన్నీ కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. శుక్ర,శని,ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారి చేసేందుకు నిర్ణయించడమైనది. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు జారి చేస్తున్న టిటిడి, తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది.
Tags:Priority in the vision of Srivari for the common devotees