ప్రైవేటు బస్సు బోల్తా…ప్రయాణికులకు గాయాలు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా పెళ్ళాకూరు మండలం వడ్డీ పాలెం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఘటనలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.బస్సు వైజాగ్ నుండి తిరుపతికి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికితరలించారు.
Tags:Private bus overturned…passengers injured

