విశాఖలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు నిరసన సెగ
విశాఖపట్నం ముచ్చట్లు:
పద్మనాభం మండలంలో అల్లూరి 125వ జయంతి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు నిరసన సెగ తగిలింది. పాండ్రంకి గ్రామంలో గోస్తని నదిపై బ్రిడ్జి నిర్మించాలంటూ మాజీ మంత్రిని పాండ్రంగి గ్రామస్తులతో పాటు జనసేన పార్టీ నియోజవర్గ ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ అడ్డుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని గ్రామస్తులు బైఠాయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అవంతి శ్రీనివాస్ను అక్కడి నుంచి సభాస్థలికి తీసుకువెళ్లారు.
Tags: Protest against former minister Avanti Srinivas in Visakhapatnam