Natyam ad

పీఎస్ఎల్వీ సి-55 సక్సెస్

నెల్లూరు ముచ్చట్లు:


హరికోట నుంచి పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. క్షణాల్లో నిప్పులు చిమ్ముకుంటూ రోదసిలోకి వెళ్లిన రాకెట్‌ విజయవంతం అయ్యింది. సుమారు 26 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌.. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్‌-2, 16 కిలోల లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిందిటెలియోస్‌-2 ఉపగ్రహం సింగపూర్‌ ప్రభుత్వానికి చెందినది కాగా.. దీనిని వివిధ ఏజెన్సీల అవసరాలకు వినియోగించనున్నారు. లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కలిసి అభివృద్ధి చేశాయి.

 

సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చనుంది.పీఎస్ఎల్వీ సీ-55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. ఇది పూర్తిగా వాణిజ్యపరమైనది. త్వరలో చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య లాంటి అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు ఇస్రో చైర్మన్. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తి కాకముందే.. ఇస్రో మరో రాకెట్‌ ప్రయోగించడం ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

 

Post Midle

Tags: PSLV C-55 success

Post Midle