జూన్ 8న శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో పుష్పయాగం
తిరుపతి ముచ్చట్లు:
నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో జూన్ 8వ తేదీ పుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందుకోసం జూన్ 7వ తేదీ సాయంత్రం 6-15 గంటల నుండి రాత్రి 7-45 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు.జూన్ 8న ఉదయం 11 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.గృహస్తులు (ఇద్దరు) రూ.750/- టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.అనంతరం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు వీధి ఉత్సవం జరుగనుంది.ఈ ఆలయంలో మే 4 నుండి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
Tags: Pushpayagam at Sri Veda Narayana Swamy temple on 8th June

