ఆర్ కృష్ణయ్య ఒక బ్రోకర్
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ గర్జన ర్యాలీ సమ యంలోనూ ప్రతిపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే … విద్యార్ది గర్జన సమయంలో మీడియా సమా వేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరు ను ఎండగట్టే ప్రయత్నం చేశారు.ఉత్త రాంధ్ర బీసీ సదస్సు అంటూ టిడిపి నేతలు మరోసారి వైసీపీని టార్గెట్ చేశారు.ఈ సదస్సులో పాల్గోన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆర్.కృష్ణయ్యపై నిప్పులు చేరిగారు.ఆర్ కృష్ణయ్య ఒక బ్రోకర్ అంటూనే,ఆర్ కృష్ణయ్య డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చిన బీసీ ద్రోహి అని ద్వజమెత్తారు.ఆంధ్రుల ద్రోహి కృష్ణయ్య అని,రాష్ట్ర విభజన సమ యంలో ఆంధ్రులకు అన్యాయం జరి గినా మాట్లాడలేదని అన్నారు.టీడీ పి హయాంలో బిసిలు అభివృద్ధి చెందా రని చెప్పారు.మరోవైపు మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర మాట్లాడుతూ 54 సాధి కార కమిటీ లు వేశామని,బిసి ల అభ్యున్నతి కోసం రాష్ట్ర వ్యాప్త పర్య టన చేసి ఒక నివేదిక రూపొందిస్తా మని చెప్పారు.బిసిలను అనగ తొక్క డానికి వైసిపి చూస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రెడ్డీ సామాజిక వర్గీయుల హవా కొనసాగుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ బోర్డుతో సహా అన్ని పదవుల్లో వారిదే అగ్రస్థానమని, బిసిలను అనగదొక్కి రాజా రెడ్డి పైకి వచ్చారని,ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే కాబట్టి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు.
Tags: R Krishnaiah is a broker

