శేరిలింగంపల్లిలో రాహుల్ పాదయాత్ర
శేరిలింగంపల్లి ముచ్చట్లు:
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేరుకుంది. పొద్దున్న 6గంటలకు మొదలైన యాత్ర కూకట్పల్లి మీదుగా శేరిలింగంపల్లి చేరుకుంది. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున కాంగ్రెస్ బ్యానర్లతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
మియాపూర్ నుండి అల్విన్ కాలనీ వరకు విద్యార్థులు జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. భారత మత వేశాధారణ, గాంధీ వేశాధారణలతో ఆకట్టుకునేలా స్వాగతం పలికారు.
భారీ బందోబస్త్ మధ్య సాగుతున్న యాత్ర శేరిలింగంపల్లి కిన్నెరా గ్రాండ్ లో రాహుల్ గాంధీ విరామం తీసుకున్నారు. బ్రేక్ ఫాస్ట్ తో లంచ్ చేసిన అనంతరం తిరిగి సాయంత్రం 4గంటలకు యాత్ర ప్రారంభం అయింది. మదీనాగూడ నుండి చందానగర్ మీదుగా బిఎచ్ఈ ఎల్ నుండి పఠన్ చెరు చేరుకొనుంది..
Tags: Rahul Padayatra in Serilingampally