సరస్వతీ దేవి అవతారంలో రాజశ్యామల
విశాఖపట్నంముచ్చట్లు:
విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరవ రోజు రాజశ్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిచ్చింది. వీణ చేతపట్టి భక్తులను అనుగ్రహించింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేసారు. మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజల కోసం పెద్ద ఎత్తున భక్తులు విశాఖ శారదాపీఠానికి తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాసర, అయినవిల్లి తర్వాత విశాఖ శారదాపీఠంలోనే అక్షరాభ్యాసాలు ఎక్కువగా జరుగుతాయి.

Tags: Rajashyamala in avatar of Goddess Saraswati
