భక్తిభావాన్ని పంచిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలో శనివారం జరిగిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం భక్తిభావాన్ని పంచింది. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ పారాయణం ఆదివారం ఉదయం వరకు 24 గంటల పాటు జరుగనుంది. టిటిడి బోర్డు మాజీ సభ్యులు, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది భక్తులు ఈ పారాయణంలో పాల్గొన్నారు.
Tags: Recitation of Akhanda Hanuman Chalisa that spreads devotion

