అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి
అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల సమాధానాలను నాణ్యతగా పంపాలి
జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
కడప ముచ్చట్లు:
ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు జేసి సాయికాంత్ వర్మ, డిఆర్వో గంగాధర్ గౌడ్, స్పెషల్ కలెక్టర్ రామమోహన్, హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ…. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు.**స్పందన ద్వారా.. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని..:1)పోరుమామిళ్ల మండలం చెందిన ఓ. వెంకట సుబ్బమ్మ తనకు ప్రభుత్వ భూమి ఇప్పించాలని కోరుతూ.. కలెక్టర్ వారికి వినతిపత్రం సమర్పించారు.
2 మైదుకూరు మండలం , శెట్టివారి పల్లికి చెందిన పి.శ్రీధర్ రెడ్డి తన పేరు పై 4 వీలర్ వాహనం ఉన్నట్లు ఆన్లైన్ లో చూపుతోందని, అందువల్ల తనకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాహన నమోదు ఆన్లైన్ లో తొలగించాలని కోరుతూ.. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారికి అర్జీ ద్వారా విన్నవించారు.ఈ కార్యక్రమంలో సిపివో వెంకట రావు, డి ఎం అండ్ హెచ్ ఓ డా. నాగరాజు, రిమ్స్ సూపర్ ఇన్ టెన్ డెంట్ డా. వెంకటేశ్వర రావు, ఎల్డిఎం దుర్గా ప్రసాద్, ఆర్ & బి ఎస్ ఈ మహేశ్వర రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ శ్రీనివాస రెడ్డి, సమగ్ర శిక్ష ఏపిసి ప్రభాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Resolve applicant issues expeditiously
