Natyam ad

కొండెక్కుతున్న కోడి ధరలు

నల్గొండ ముచ్చట్లు:


కొద్ది రోజులుగా చికెన్ ధర పెరుగుతోంది. ప్రస్తుతం చికెన్ ధర కిలో రూ.300 లకు చేరుకుంది. డిమాండ్ కు తగినంత సరఫరా లేకపోవటంతోనే రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెపుతున్నారు. చికెన్ వినియోగం గణనీయంగా పెరగటం కూడా చికెన్ రేట్లు పెరగటానికి కారణంగా చెపుతున్నారు.ప్రస్తుతం ఏపీలో చికెన్ రేటు రూ.300 దాటి అమ్ముతున్నారు. రేటు పెరిగినా వినియోగం మాత్రం తగ్గలేదని వ్యాపారస్తులు చెపుతున్నారు. సాధారణంగా ఏపీలో రోజుకు లక్షా 25 వేల బ్రాయిలర్ కోళ్లు అమ్మకం జరుగుతూ ఉంటే…. ఆదివారాలు ఈ సంఖ్య రెట్టింపై 2లక్షల 50 వేలకు చేరుకుంటోంది.జూన్ 18న కిలో చికెన్ ధర రూ, 218 గా ఉంది. అది జులై 1నాటికి రూ.230కి చేరింది. అప్పటి నుంచి పెరుగుతూ   జులై19 కి రూ.296కి చేరింది. అంటే నెల రోజుల్లో కిలోకి రూ.78 లు, 19 రోజుల్లో రూ.66 కి పెరిగింది. గతేడాది మే 15న చికెన్ కిలో రూ. 312 కిచేరుకుని ఆల్ టైం రికార్డు సృష్టించింది.

 

 

 

సాధారణంగా హ్యాచరీల నిర్వాహకులు ప్రతి ఏటా మే ..జూన్ నెలల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. ఆ సమయాల్లో వీరు పౌల్ట్రీలకు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెలన్నర రోజుల క్రితం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హ్యాచరీల నిర్వాహకులు క్రాప్‌ హాలిడే అమలు చేశారు.  దీంతో ఫారాల్లో కొత్త బ్యాచ్‌లు వేయడం తగ్గిపోయింది. దాదాపు నాలుగు వారాల నుంచి మళ్లీ కొత్త బ్యాచ్‌లు వేయడం మొదలు పెట్టారు. ఇవి 35 , 40 రోజుల్లో పెరుగుతాయి. ఆ బ్యాచ్ లో  వేసిన కోళ్లు త్వరలో  ఒక్కోటి  రెండు కిలోలలకు పైగా పెరుగుతుంది.అందువల్ల చికెన్ రేట్లు రాగల రెండు,మూడు  వారాల్లో మరింత తగ్గుముఖం పడుతాయని  వ్యాపార వర్గాలు అంచానా వేస్తున్నారు. దీంతో అవసరమైన కోళ్లు అందుబాటులోకి వస్తే రేటు కిలో రూ. 250 కి దిగివచ్చి చికెన్ ప్రియులకు మరింత అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. చికెన్‌తో కరోనా రాదని, పైగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతుండటంతో పట్టణాల్లో అయితే వారానికి మూడు రోజులు చికెన్ తింటున్నారు. ఇక పల్లెల్లో కూడా చికెన్ వినియోగం పెరిగింది. పైగా ఆషాడ మాసం బోనాలు, మొక్కులు చెల్లించుకోవడం కూడా కలిసి రావడంతో కోళ్ల విక్రయాలు పెరిగినట్లు చికెన్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు.

 

 

 

 

Post Midle

ముఖ్యంగా నాటుకోడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కిలో నాటు కోడి ధర రూ.500 ఆపై మాటే. కరోనా వచ్చిన వారు ఎక్కువగా నాటుకోడి తింటున్నారని తెలియడంతో.. ముందస్తుగానే జనాలు నాటుకోడి తినేందుకు పరుగులు తీస్తున్నారు. దీంతో ధరలు అమాంతం పెరిగాయిఅన్ని చికెన్ సెంటర్లలోనూ బ్రాయిలర్, లేయర్ కోళ్లతో పాటు నాటు కోళ్లను కూడా విక్రయిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాలలో నాటుకోళ్లు ఎక్కువగా అందుబాటులో ఉండటం లేదు. గ్రామాల్లోనే ఎక్కువగా తింటుండంతో వాటి సరఫరా తగ్గిపోయిందని చికెన్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామాల్లో కిలో నాటుకోడి ధర రూ.350 వరకు పలుకుతోంది. గతంలో ఈ ధర రూ.250 వరకు ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. సహజ వాతావరణంలో పెరిగే నాటుకోడి రుచికి రుచి, బలం, ఆరోగ్యం వస్తుందని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగాయి.ఊర్లలో కూడా వినియోగం పెరగడంతో పట్టణాలకు సరఫరా తగ్గి కొరత ఏర్పడింది. అయితే తమకు మాత్రం ఇంకా గిట్టుబాటు కావడం లేదని బ్రాయిలర్ పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. కరోనాతో వచ్చిన నష్టం అంతా ఇంత కాదని, ఇప్పుడు కూడా పెద్దగా ఏమి మిగలడం లేదని వాపోతున్నారు. కిలో బ్రాయిలర్ ధర తమ నుంచి రూ.90 వరకే ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి నెలలో కోళ్లతో కరోనా వస్తుందనే అసత్య ప్రచారంతో పౌల్ట్రీ కుదైలైంది. పౌల్ట్రీ ఫాంల నుంచి ఉచితంగానే కోళ్లను కూడా పంపిణీ చేసిన విషయం విధితమే.

 

Tags: Rising chicken prices

Post Midle