రూ.4.21లక్షల రేషన్ బియ్యం సీజ్..
రాయచోటికి చెందిన ఇద్దరు అరెస్ట్…
మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా, రాయచోటి నుంచి మదనపల్లి మీదుగా లారీలో అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్న, పిడిఎస్ రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేసి ఇద్దర్ని అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి మదనపల్లి డిఎస్పి ప్రసాద్ రెడ్డి కథనం మేరకు వివరాలు.. రాయచోటికి చెందిన గౌస్ మొహిద్దిన్, మక్బూల్ ఇద్దరూ డ్రైవర్లు కలసి లారిలో రూ. 4.21 లక్షల విలువైన 583 బస్తాల పిడిఎస్ రేషన్ బియ్యం అక్రమంగా బెంగుళూరుకు తరలిస్తుండగా సమాచారం అందిందన్నారు. ఈ మేరకు సిబ్బంది వెళ్లి, మదనపల్లి నెమలి నగర్ వద్ద లారీ సహా బియ్యం సీజ్ చేసి డ్రైవర్లను అరెస్టు చేశామన్నారు. లారీ సుమారు 25 లక్షలు అందులో పట్టుబడిన బియ్యం మరో 4.21 లక్షలు విలువైనవి సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేయగా మరొకరు పారిపోయాడని చెప్పారు. అయితే ఈ కేసులో బియ్యం అక్రమ రవాణా చేటున్న వ్యాపారి ఎవరనేది పరారీలో ఉన్న నిందితుడు దొరికితే తెలుస్తుంది అన్నారు.
Tags; Rs. 4.21 lakh ration rice siege..