ఇసుక టిప్పర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నందిగామ ముచ్చట్లు:
కంచికచర్ల మండలం కీసర బిజెటి కాలేజీ వద్ద టిప్పర్ ను ఆర్టీసీ వెన్నెల బస్సు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ గాయాలు అయ్యాయి. బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతోంది. బస్సులో 29 ప్రయాణికులు బస్సులో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇసుక లోడింగ్ చేసుకొని ఒకేసారి టిప్పర్ రోడ్డు మీదకు రావడంతో ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం లారీ డ్రైవర్ ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags: RTC bus collided with sand tipper

