ఉషోదయ ఫౌండేషన్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న సాల్వరాజు సతీష్ కుమార్..
పుంగనూరు ముచ్చట్లు:
ఉషోదయ ఫౌండేషన్ ద్వారా ఘనంగా జాతీయ కవి సమ్మేళనం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి నిర్వహించిన ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విచ్చేసిన కవులు అందరూ ఉషోదయ ఫౌండేషన్ భాకరాపేట అర్జున్ ఫంక్షన్ హల్ నందు బోయి భీమన్న అవార్డులను మరియు ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను ఉమ్మడి రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవ చేసిన విశిష్ట వ్యక్తులకు అవార్డులు అందజేశారు.తెలుగు సాహిత్యంకు పట్టము కడుతూ ప్రముఖ కవిగా మరియు ఉత్తమ జర్నలిస్ట్ గా చిత్తూరు జిల్లా పుంగనూరు సీనియర్ జర్నలిస్ట్ సాల్వరాజు సతీష్ కుమార్ కు ప్రముఖులు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రలలో పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న విశిష్ట వ్యక్తుల వివరాలు సేకరించి వారికి మా ఉషోదయా ఫౌండేషన్ ద్వారా బోయాబీమన్న స్మారక జాతీయపురస్కారం-2023 అవార్డులను అందజేయడం జరిగిందని, అలాగే తెలుగు భాష సాహిత్యం కొరకు ప్రతి తెలుగువారు అందరు కృషి చేయాలని కోరారు.జానపద పద్యమును ఏంతో చక్కగా ఆలపిస్తూ ప్రసాద్ సుమతీ కవితాగానము చేయడము జరిగింది.ఇందులో ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను 100 మంది వివిధ రంగాల్లోని వారికి ప్రధానo చేయడం జరిగింది ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఆధికవి నన్నయ్య విశ్వవిధ్యాలయ అధిపతి తరపట్ల సత్యనారాయణ ప్రొఫెసర్ బుజ్జి మార్జీయాన పోఫెసర్ మరియు తిరుపతి షీ టీమ్ ఆఫీసర్ సుమతీ మెడికో బ్రాడ్ సి ఈ ఓ డా. రామ్ డైరెక్టర్ సంగీత మరియు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డ, ఫాస్టర్ సైలెస్ ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ధనాశి ఉషారాణి, రామ చంద్రయ్య వరప్రసాద్ రోహిల కార్యక్రమంను నిర్వహించారు. గోవిందు హరిచంద్ర ఘట్టం పధ్యములతో చక్కగా అలరించడము జరిగింది. రత్నo రామ్ చందర్ జీ ఉషోదయ ఫౌండేషన్ గురించి నూతన ప్రక్రియలు గురించి వివరించారు. బన్ని మస్తాన్ డాన్సర్ మరియు సాయిరాం స్కూల్ పిల్లలు చక్కగా నృత్యపదర్శన చేయండి జరిగింది. రానున్న కాలంలో తెలుగు భాష గొప్పతనం కోసం ఉషోదయా ఫౌండేషన్ విశిష్ట సేవలు సాహితీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని పెద్దలు చెప్పడం జరిగింది.

Tags: Salvaraju Satish Kumar received Ushodaya Foundation Best Journalist Award.
