Natyam ad

బీజేపి కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ బీజేపీ కార్యాలయంలో సంక్రాం తి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. సంప్రదాయ దుస్తులతో నాయకులు, కార్యకర్తలూ ఈ సంబరాల్లో ఉత్సాహం గా పాల్గొన్నారు.రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, ధాన్యపు రాశుల వద్ద నృత్యాలూ చేసి పండుగ సందడి చేశారు. చెరకు గడలు, పొంగళ్లు, ఎద్దుబళ్లు, గాలిపటాలతో సంక్రాంతిని కళ్లకు కట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. భోగి మంటలు, గంగిరెద్దు శుభాశీస్సులు వంటివి ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేశాయి. సరదాగా కోడి పుంజులను పందాలకు దింపి ఆటలు ఆడారు. అనంతరం సంప్రదాయక సంక్రాంతి పిండి వంటలతో అతిధి సత్కారాలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవీంద్ర మాట్లాడుతూ తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి, రాష్ట్ర ప్రజలకు నవ క్రాంతిని తేవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
 
Tags: Sankranthi celebrations at the BJP office