మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి సంబురాలు
మేడ్చల్ ముచ్చట్లు :
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో వేలాదిమంది తో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, మరియు కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, సిని మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, సిని హీరో డి.జె టిల్లు, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఒకే ప్రాంగణంలో దాదాపు 25వేల విద్యార్థినీలు, 15వేల విద్యార్థులతో ఈ సంబరాలు నిర్వహించడం పట్ల సందర్శుకులు ఉత్సహాంగా కనిపించారు..ఇంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటిలు నిర్వహించినందుకు గానూ కళాశాల యాజమాన్యానికి ఇండియన్ బుక్ అఫ్ రికార్డు”లో రికార్డు సాధించడం జరిగింది. ఇండియన్ బుక్ అఫ్ రికార్డు వారిచే సర్టిఫికెట్ మోడల్ స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డి.జె టిల్లుతో కలిసి మంత్రి మల్లారెడ్డి కూడా డ్యాన్స్ చేసి అందరిని అబ్బుర పరిచారు.
Tags: Sankranti celebrations at Mallareddy University