ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
విజయవాడ ముచ్చట్లు:
విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి. “పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది.
Tags; Scattered light to moderate rains in AP

