Natyam ad

పుంగనూరులోవైభవంగా రెండవరోజు దేవి నవరాత్రి ఉత్సవాలు

పుంగనూరుముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రెండవ రోజు పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు ఆధ్వర్యంలో శ్రీ అష్టలక్ష్మీ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. అలాగే శ్రీబోగనంజుండే శ్వరస్వామి ఆలయంలో పార్వతిదేవిని విభూదితో అలంకరించి ,శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమ్మవారిని జిడిపప్పుతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీచాముండేశ్వరి ఆలయంలో అమ్మవారిని, శ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. అలాగే మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన బురడగుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో హ్గమాలు నిర్వహించి, అభిషేకాలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

 

Tags: Second day of Devi Navratri celebrations in Punganur

Post Midle