అభివృద్ధి చూసి వైఎస్సార్సీపీకి ఓట్లు వేయండి
పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేయాలని పలువురు ఓటర్లను కోరారు. శనివారం పట్టణంలో నానబాలవీధి, నాగపాళ్యెం, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో పిఆర్ఆర్ వారియర్స్ డాక్టర్ శివ, డాక్టర్ శరణ్, త్రిమూర్తిరెడ్డి, మధుసూదన్రెడ్డి, మహిపాల్రెడ్డి, బాలసుబ్రమణ్యం, పి.ఎల్.శ్రీధర్, కృష్ణప్ప, శ్రీనివాసులు, నానబాలగణేష్, రెడ్డెప్ప, ఆర్కె.రామకృష్ణ, బిటి.అతావుల్లా లు కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే నానబాలవీధిలో కౌన్సిలర్ నయీంతాజ్ , మైనార్టీల నాయకుడు ఇంతియాజ్ఖాన్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మసీదు ముతవల్లి అజీజ్సాహెబ్ను కలసి మైనార్టీ ఓట్లు వైఎస్సార్సీపీకి వేయించాలని కోరారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. డాక్టర్ శివ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో రషీదబేగం, శ్రీనివాసులురెడ్డి, సుధాకర్రెడ్డి, తుంగా చంద్రశేఖర్, భాస్కర్జెట్టి, రఘునాథరెడ్డి, సునిల్, తీర్థానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags; See the development and vote for YSRCP