ఏడవ రోజు లోకేష్ పాదయాత్ర
పూతలపట్టు ముచ్చట్లు:
మొగిలి క్యాంప్ సైట్ నుంచి శుక్రవారం ఉదయం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏడవ రోజు పాదయాత్ర ప్రారంభం అయింది. పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ప్రతి రోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. తరువాత అయన స్వయంభు శ్రీ మొగిలీశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags: Seventh day Lokesh Padayatra

