పుంగనూరులో సచివాలయ నిధులతో మురుగునీటి కాలువ పనులు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని నాల్గవ వార్డులో కౌన్సిలర్ జయభారతి ఆధ్వర్యంలో శుక్రవారం మురుగునీటి కాలువ పనులకు భూమి పూజ చేశారు. కౌన్సిలర్ మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సచివాలయ నిధులతో భగత్సింగ్కాలనీలో మురుగునీటి కాలువల నిర్మాణం, ప్రహారీగోడ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సచివాలయాల ద్వారా ఆప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ మునిరెడ్డి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Tags: Sewerage works at Punganur funded by Secretariat