రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి
రాజమండ్రి ముచ్చట్లు:
తూర్పు గోదావరి గొల్లప్రోలు మండలం చెబ్రోలు జాతీయరహదారి పై కారు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున గొర్రెల కాపరులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒక గొర్రెల కాపరి మృతి చెందాడు. మరో కాపరికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ప్రమాదంలో మరికొన్ని గొర్రెలకు తీవ్రగాయాలు అయ్యాయి. కారు కాకినాడ నుంచి వైజాగ్ వైపు కారు వెవేళ్ళాడుతూండగా ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాకినాడ జె యన్ టి యు విసీకి చెందిన కారుగా గుర్తించారు. తుని కి చెందిన గొర్రెల కాపరులు, పండుగా కావటంతో తిరిగి మందలను ఇంటికి తోలుకుని పోతుండగా ప్రమాదం జరిగింది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్రెడ్డి
Tags: Shepherd killed in road accident