వరద నీటిలో మునిగిన శివాలయం
నిజమాబాద్ ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పురాతన ఆలయాలను వరద ముంచెత్తింది.ఆలయాలు నీట మునిగాయి.కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పుష్కర ఘాట్ లోని శివాలయం నీటిలో మునిగిపోయింది. అటు నందిపేట్ మండలం ఉమ్మెడ శివారులో గోదావరి నది ఒడ్డున ఉన్న ఉమా మహేశ్వర ఆలయంలోకి భారీ గా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ఆలయం పూర్తిగా జలమయ మైంది.నీటి ప్రవాహం తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంతం వైపు ఎవరు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Tags: Shiva temple submerged in flood water