కృష్ణా ఎక్స్ ప్రెస్ లో పొగలు…ప్రయాణికులు అప్రమత్తం
వెంకటగిరి ముచ్చట్లు:
తిరుపతి నుండి అదిలాబాద్ వెళ్ళే కృష్ణా ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుండి అదిలాబాద్ బయలు దేరిన కృష్ణా ఎక్స్ప్రెస్
వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఏసీ కోచ్ లో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురైయారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు, వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది పొగలను ఆపివేయడంతో కృష్ణ ఎక్స్ప్రెస్ భారీ ప్రమాదం తప్పినట్లు అయింది,దీంతో 20 నిముషాలు పాటు ఆగిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా బయలుదేరింది.
Tags; Smoke in Krishna Express…passengers alert

