దుర్గగుడి చైర్మన్
విజయవాడ
గత ప్రభుత్వంలో అమ్మవారి ఆలయానికి సంబంధించి సొంత నిధులు ఏమీ ఖర్చు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అమ్మవారి దేవస్థానానికి ప్రభుత్వ ఖజానా నుంచి 70 కోట్ల రూపాయలని అభివృద్ధి పనులు నిమిత్తం ఇచ్చారని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. అన్నదానానికి సపరేట్ భవనాన్ని ఏర్పాటు చేసి అందులో అన్నదానం చేయాలని నిర్ణయించాం. 70 కోట్లలో 30 కోట్ల పెట్టి అన్నదాన భవనాన్ని నిర్మించడానికి సాంక్షన్ చేసాం. 27 కోట్లు పెట్టి ప్రసాదం పోటు భవనాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. అమ్మవారి దేవస్థానంలోనా నిధుల్ని అమ్మవారి దేవస్థానానికి ఖర్చుపెడుతున్నామని అన్నారు
.
ప్రతి ఒక్కరినీ టెండర్లకు పిలవడం జరిగింది. ట్రస్ట్ బోర్డ్ లో అందరూ తీసుకున్న నిర్ణయానికి ఈవో ఆమోదించారు. దానికి ఈ ఓ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. శివాలయానికి ఐదు కోట్ల 60 లక్షలు రూపాయలు వెచ్చించి పునర్నిర్మానం చేస్తున్నాం. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుమొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేయబడుతున్నాం. 13 కోట్లు పెట్టి వెలివేటెడ్ క్యూ లైన్స్ ని కూడా ఏర్పాటు చేయనున్నాము దానికి సంబంధించి టెండర్లను కూడా ఇప్పటికే పిలిచామని అన్నారు.
Tags;Special Annadana building near Durgamma Sannidhi