ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నారాయణ పేట ముచ్చట్లు:
ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి మండలాల ప్రత్యేక అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి, మయంక్ మిత్తల్ , ఏఓ నర్సింగ్ రావు, జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Special authorities should take action to redress complaints – District Collector Koya Shri Harsha