పుంగనూరులో అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు
పుంగనూరు ముచ్చట్లు:
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం ఏడవరోజు పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీబోగనంజుండే శ్వరస్వామి ఆలయంలో పార్వతిదేవిని పత్తితో అలంకారం చేశారు. శ్రీవిరూపాక్షి మారెమ్మను కూరగాయలతో అలంకరించారు. నాగపాళ్యెంలోని మార్వాడిలు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో ఏర్పాటు చేసి పూజలు చేశారు. శ్రీచాముండేశ్వరి అమ్మవారిని, శ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. మండలంలోని చదళ్ల గ్రామంలో వెలసిన శ్రీచౌడేశ్వరిదేవిని దుర్గాదేవి అలంకారంలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆలయాల్లో హోమాలు నిర్వహించి, అభిషేకాలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special decorations for Ammavars in Punganur
