పుంగనూరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని మర్రిమాకులపల్లెలో వెలసియున్న శ్రీప్రసన్నవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఏడూరు గ్రామంలో వెలసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయము, పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, యాబైరాళ్ల వెహోరవ వద్ద గల శ్రీశనేశ్వరస్వామి ఆలయంలోను ప్రత్యేక పూజలు ,హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Special Pujas in Punganur Temples

