Date:30/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
తుఫాన్ కారణంగా పడిపోయిన వరిపంటపై ఉప్పు చల్లాలని ఏడి లక్ష్మానాయక్ రైతులకు సూచించారు. సోమవారం ఆయన ఏవో సంధ్య, హెచ్వో లక్ష్మీప్రసన్న తో కలసి మండలంలోన ఆరడిగుంట , బసివినాయునిపల్లె గ్రామాల్లో తుఫాన్కు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల్లో ఏడి రైతులతో సమావేశమైయ్యారు. వరి పంటపై ఉప్పు చల్లడంతో వరి పంట నల్లబడకుండ , మో లకెత్తకుండ ఉంటుందని సూచించారు. పంటల నష్టంపై పూర్తి నివేదికలను జిల్లా కలెక్టర్కు పంపి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
Tags; Sprinkle salt on the rice