శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానముకు రూ. 50,000 విరాళo
చౌడేపల్లె ముచ్చట్లు:
చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ ఆధ్వర్యంలో 04-న మద్దు నాగమణి, మద్దు వెంకటేష్ ప్రసాద్, కడప వాస్తవ్యులు రూ. 50,000/-లు, M. శ్రీనివాసులు రెడ్డి తులసి, బి.కొత్త కోట వాస్తవ్యులు రూ. 6,000/-లు, P. వాలకేశ రాజు నాగేశ్వరమ్మ, అరవీడు వాస్తవ్యులు రూ. 5,120/-లు శ్రీ అమ్మవారి అన్న ప్రసాదమునకు విరాళములుగా ఇచ్చినారు. నేడు S.P. వెంకట్రామప్ప, తిరుమన పల్లి వాస్తవ్యులు దేవస్థాన గోశాలకు ఆవును విరాళముగా ఇచ్చినారు. ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ధర్మకర్త మండలి సభ్యులు పూర్ణిమ రాయల్ మోహన్, శ్రావణి భాను ప్రకాష్ , దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొని వారికి తీర్థ ప్రసాదములు అందజేసి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యము కల్పించినారు.

Tags:Sri Boyakonda Gangamma Devasthanam Rs. 50,000 donation
