గరుడవాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా మూడో వాహనమైన గరుడ వాహనసేవ వేడుకగా జరిగింది.గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం (ఉదయం 11 నుండి 12 గం||ల వరకు) పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, మొరంశెట్టి రాములు, మారుతి ప్రసాద్, మధుసూదన్ యాదవ్, జెఈఓలు సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబు ఇతర టిటిడి అధికారులు ఈ వాహన సేవలో పాల్గొన్నారు.

Tags:Sri Malayappa’s criticism of Garudavahanam
