Natyam ad

తిరుమల తరహాలో శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలు

– తిరుచానూరులో కోయిల్‌ ఆళ్వార్‌
తిరుమంజనంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్   భూమన కరుణాకరరెడ్డి

 

తిరుమల ముచ్చట్లు:

 

Post Midle

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారని టీటీడీ ఛైర్మన్  భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌
ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీటీడీ ఛైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించామన్నారు. నవంబరు 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 14న అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారని తెలిపారు. 18న పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దాదాపు రూ.9 కోట్లతో పంష్కరిణిని ఆధునీకరించి నీటితో నింపారని తెలియజేశారు.ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.15 పరదాలు విరాళంఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి చైర్మన్  కరుణాకర రెడ్డి చేతుల మీదుగా భక్తులు 15 పరదాలను విరాళంగా అందించారు. హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన శ్రీ అరుణ్ కుమార్,  పద్మావతి, తిరుచానూరుకు చెందిన పవిత్ర,  రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలోటీటీడీ బోర్డు సభ్యులు
యానాదయ్య, నాగసత్యం,  సుబ్బరాజు, జేఈవో  వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, విజివో  బాలిరెడ్డి, ఏఈవో  రమేష్, పాంచరాత్ర ఆగమసలహాదారు  శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్లు  శ్రీవాణి,  శేషగిరి, అర్చకులు  బాబుస్వామి,  వేంపల్లి శ్రీను స్వామి,  మణికంఠ స్వామి, సిఐ శ్రీ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Sri Padmavati Goddess Vehicular Services in the style of Tirumala

Post Midle