సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి
పుంగనూరుముచ్చట్లు:
మాజీ మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డిలు గురువారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు చర్చలు జరిపారు. ఈ మేరకు పులివెందులలో నామినేషన్ వేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని శ్రీనాథరెడ్డి దంపతులు కలిసి పార్టీలో చేరారు. సీఎం వారికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్న శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి లు వైఎస్సార్సీపీలోకి రావడంతో పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బ పడింది. శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆశయాలు, ముఖ్యమంత్రి పనితీరు , అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు.
Tags: Srinatha Reddy and Anisha Reddy joined the party in the presence of CM Jagan