Natyam ad

పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయ‌ణుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు

తిరుపతి ముచ్చట్లు :
 
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఆదివారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడు లోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారికి విశ్రాంతి, సుఖనిద్ర ఇస్తున్నాడు.ఈ వాహన సేవలో జెఈవో  వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో  గురుమూర్తి,సూపరింటెండెంట్లు  చెంగ‌ల్రాయులు, ర‌మ‌ణ‌య్య‌,, ఆల‌య అర్చ‌కులు  బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.
 
Tags; Srinivasan in the garb of Vaikuntha Narayana on a relic vehicle