పుంగనూరులో నాగరాజుకు పరమత సహనం అవార్డు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని వివిధ రకాల ప్రజలకు విశిష్టమైన సేవలు అందిస్తున్న నాగరాజుకు పరమత సహనం అవార్డును అందజేశారు. మంగళవారం జిల్లా ఒకేషనల్ ఎడ్యూకేషనల్ అధికారి దయానందరాజు , భారత్ నిర్మాణ సేవా సంఘ ప్రధాన కార్యదర్శి అయూబ్ఖాన్లు కలసి అవార్డులు ప్రధానం చేసి, నాగరాజును సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్రెడ్డి, లెక్చరర్లు మైనుద్దిన్, సువర్ణ, తేజశ్వని, గిరిధర్, పవన్కుమార్ పాల్గొన్నారు.

Tags: Supreme Patience Award to Nagaraj at Punganur
