జంట హత్య కేసులో మరణశిక్ష పడ్డ సయ్యద్ మౌలాలి
– తల్లి బిడ్డల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
చిత్తూరు ముచ్చట్లు:

తల్లి బిడ్డలను హత్య చేసి ఆపై వారి మైనర్ కూతుర్ని కూతుర్ని రేప్ చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఏడిజే కోర్టు న్యాయమూర్తి రమేష్ మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. తంబళ్లపల్లి మండలంలో తల్లి బిడ్డను హత్య చేసిన నిందితుడు మౌలాలికి చిత్తూరు ఏడిజె కోర్టు న్యాయమూర్తి రమేష్ ఉరి శిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. లైజనింగ్ అధికారి ఎతిరాజులు ఏపీపీల కథనం మేరకు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లి కు చెందిన తల్లి బిడ్డ లు సరళమ్మ గంగులమ్మ లను అదే ఊరికి చెందిన సయ్యద్ మౌలాలి అక్రమ సంబంధం పెట్టుకుని వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లీ బిడ్డలను దారుణంగా హత్య చేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా వారి మైనర్ కూతుర్ని కూడా రేప్ చేశాడు. ఈ కేసులు చిత్తూరు ఏడిజెక్టివ్ న్యాయమూర్తి రమేష్ మంగళవారం నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు విధించారు. కేసును గవర్నమెంట్ తరఫున ఏపిపి లోకనాథరెడ్డి వాదించారు.
Tags: Syed Moulali was sentenced to death in the double murder case
