ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోండి..ఏపీఓ వెంకటేశ్వర్లు
పత్తికొండ ముచ్చట్లు:
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎపీఓ వెంకటేశ్వర్లు కోరారు. గురువారం పత్తికొండ మండలంలోని తదితర ప్రాంతాలలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం ఎంపీడిఓ మాట్లాడుతూ పత్తికొండ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఉపాధి హామీ పనులను మొదలుపెట్టారు .అలాగే కూలీలు సమయ పాలన పాటించాలని, గ్రామీణ పేదలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.పనుల కోసం జాబ్ కార్డు కోరిన వెంటనే సంబంధిత అధికార్లు అందిస్తారని తెలిపారు. పథకం సాఫ్ట్ వేర్ మార్పులు జరిగాయని వేతనాలు చెల్లింపులో ఇబ్బందులు ఉండవని ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిలాన్, పాల్గొన్నారు.
Tags: Take advantage of employment opportunities..APO Venkateshwarlu