పుంగనూరులో ఓటిఎస్ను సద్వినియోగం చేసుకోండి
పుంగనూరు ముచ్చట్లు:
రుణ గ్రహితలు ఓటిఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రుణవిముక్తులు కావాలని కౌన్సిలర్ రేష్మా కోరారు. మంగళవారం 18వ వార్డు కుమ్మరవీధి సచివాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఏళ్ళ తరబడి బకాయిలను రద్దు చేసి , నామమాత్రపు రుసుముతో లబ్ధిదారులను రుణవిముక్తులను చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు , వలంటీర్లు పాల్గొన్నారు.
Tags; Take advantage of OTS in Punganur