తెలంగాణ మద్యం స్వాధీనం
నందిగామ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్డు సమీపంలో సీఐ హనీష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు కారులో తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.చందర్లపాడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద లక్ష రూపాయలు విలువచేసే 528 క్వార్టర్ బాటిల్ షిఫ్ట్ కారు సీజ్ చేసామని సిఐ హనీష్ తెలిపారు. అక్రమంగా తెలంగాణ మద్యం ఆంధ్రలోకి తీసుకుని వచ్చి అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలలో ఎస్ఐ పండు దొర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Telangana liquor seized

