Natyam ad

టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

– అదనపు కలెక్టర్ కే సీతారామారావు

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

Post Midle

నాగర్ కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ 15వ తేదిన జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం రెవిన్యూ అదనపు కలెక్టర్ ఛాంబర్ లో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్..2023 పరీక్షల ఏర్పాట్లతో అదనపు కలెక్టర్ పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..
టెట్ పరీక్షలను సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు సంసిద్దులు కావాలన్నారు. జిల్లాలోని నాగర్ కర్నూల్ పట్టణంలో 22 పరీక్ష కేంద్రాలు, కల్వకుర్తి పట్టణంలో 2 పరీక్ష కేంద్రాలు, అచ్చంపేట పట్టణంలో 6 పరీక్ష కేంద్రాలు, బిజినపల్లి మండల కేంద్రంలో 6 పరీక్ష కేంద్రాలల్లో టెట్టు పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన వివరించారు.

 

 

ఈ నెల 15వ తేదిన నిర్వహించే పరీక్షలో పేపర్.1, పేపర్‌_2 ఉంటాయని తెలిపారు.
టేట్టు పరీక్ష మొదటి పేపర్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, 36 పరీక్షా కేంద్రాలలో 8539 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
అలాగే పేపర్. 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 28 పరీక్షా కేంద్రాలలో 6468 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కోన్నారు. మొత్తంగా 15007 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.
పరీక్షల భద్రత కోసం పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు, ప్రశ్న పత్రాలకు రెవెన్యూ, విద్యా శాఖల సంయుక్తంగా పర్యవేక్షించనున్నాని ఆదేశించామన్నారు.
పరీక్షల పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు.

 

 

పరీక్షా కేంద్రాల నిర్వహణకు విద్యుత్ శాఖ నిరంతరం విద్యుత్ జరిగే విదంగా, మునిపాలిటీ నుంచి శానిటేషన్, తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ ఏర్పాట్లు, పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటుతో పాటు గాలి, వెలుతురు ఉండే విధంగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిభిరాలు కూడా ఏర్పాటు చేయాలని, మహిళ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయాలని సూచించారు.
సిసి కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ చేపడుతున్నామని ఆయన వివరించారు.

 

సెల్ ఫాన్లకు అనుమతి లేదని, ఆలాగే ఆర్టీసీ అధికారులు పరీక్షా సమయాలను అనుసరించి ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. పరీక్షాల కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని సూచించారు.
ఈ సమన్వయ సమావేశంలో  జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు, ఆర్టిఏ ఎర్రి స్వామి, డిపిఆర్ఓ సీతారాం, కలెక్టరేట్ ఈవో శ్రీనివాసులు ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు,  మున్సిపల్ కమీషనర్ యాదయ్య, ఆర్టీసీ డిఎం టి దేవరాజ్ విద్యుత్ శాఖ ఎడిఈ ఆదిశేషయ్య, వైద్య ఆరోగ్యశాఖ తరఫున నరసింహ, పోలీస్ శాఖ తరపున ఎస్బిసిఐ బాబు, అచ్చంపేట కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: TET exams should be conducted with caution

Post Midle