బ్రాహ్మణులపై దాడి శోచనీయం
పుంగనూరు ముచ్చట్లు:
బ్రాహ్మణులపై దాడులు శోచనీయమని , దాడిని ఖండిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘ కార్యదర్శి రామమూర్తి తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో పెండ్లిపందిరిలో బ్రాహ్మణులపై దాడి చేసి అవమానించిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలన్నారు. బ్రాహ్మణులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బాబు, శివకుమార్, పవన్కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags; The attack on Brahmins is deplorable