మదనపల్లి వద్ద బస్సు బోల్తా- పలువురి పరిస్థితి విషమం..!
మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి బెంగళూరు రోడ్డులో ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడి పలువురు పరిస్థితి విషమించిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్లే ఓ ప్రయివేటు బస్సు మదనపల్లి సమీపంలోని మర్రిమాను బొమ్మల ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.ఈప్రమాదంలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను 108 సిబ్బంది మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బస్సు ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు.30 మందికి పైగా కాళ్లు చేతులు విరగగా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి కొంతమంది మిగిలిన వారిని బెంగుళూరుకు తరలించిన పోలీసులు.సంఘటన స్థలానికి చేరుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు.వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:The bus overturned at Madanapally – the condition of many people is critical..!
