ఖైదీలకు కేంద్రం శుభవార్త
దిల్లీ ముచ్చట్లు:
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఖైదీలకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఖైదీలకు శిక్ష తగ్గించే ప్రణాళికలను రూపొందించింది. 50 ఏళ్లు దాటిన మహిళలు, ట్రాన్స్జెండర్లకు… 60 ఏళ్లు పైబడిన పురుషులు, దివ్యాంగ ఖైదీలకు శిక్ష తగ్గించి విడుదల చేయనుంది. నిర్దేశించిన అర్హతలు ఉన్నవారిని 3 విడతల్లో విడుదల చేస్తారు. జైలులో ప్రవర్తనను బట్టి రాష్ట్రస్థాయి స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి విడుదల చేస్తుంది. మరణశిక్ష, జీవితఖైదు, అత్యాచారం, తీవ్రవాదం, మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా దోషులు శిక్ష తగ్గింపునకు అనర్హులు..
Tags: The center is good news for the inmates