అదుపు తప్పి వంతెన పై నుంచి బస్సు బోల్తా

The crane is over the bridge over the bridge
Date:11/08/2018
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.సారపాక-నాగినేని ప్రోలు మార్గంలో ఆర్టీసీ బస్సు వాగు వంతెనపైనుంచి అదుపు తప్పి బోల్తా పడింది. ఉదయం నుంచి కురుస్తోన్న వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్డుపై గుంతలను తప్పించబోయి బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Tags:The crane is over the bridge over the bridge