జూన్ 22 నుండి 24వ తేదీ వరకు వస్త్రాల ఈ -వేలం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వస్త్రాలను జూన్ 22 నుండి 24వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో పాలిస్టర్ నైలాన్ / నైలెక్స్ చీరలు, ఆర్ట్ సిల్క్ చీరలు, బ్లౌజ్పీస్లు కొత్తవి, వినియోగించిన వస్త్రాలున్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org వెబ్సైట్ను గానీ సంప్రదించగలరు.

Tags: The e-auction of garments will be held from June 22 to 24
