నీటికల సాకారం! – మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-3.5 టీఎంసీల సామర్థ్యంతో ఆవులపల్లె రిజర్వాయర్ నిర్మాణం
-60వేల ఎకరాలకు సాగునీరు
-ఉమ్మడి చిత్తూరుజిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్ ఇదే
-పుంగనూరు నియోజకవర్గానికి శాశ్వత నీటి కష్టాలకు చెక్
పుంగనూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లాలో అతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఆవులపల్లె రిజర్వాయర్ నిలవనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం ఆవులపల్లె గ్రామంలో 3.50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం భూమి పూజ చేయడంతో ఇక పనులు వేగంగా సాగనున్నాయి. ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరుజిల్లాలో మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణానికి సిద్దమైంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ముదివేడు రిజర్వాయర్, పుంగనూరు నియోజకవర్గంలో నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లను నిర్మించి ప్రజలకు తాగునీటి, సాగునీటి కష్టాలను తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.2,144.50 కోట్లు మంజూరు చేసింది. ఇందులో నిర్మాణాలకు రూ.1,529.37 కోట్లు, ఇతరా పనులకు రూ.615.13కోట్లు కేటాయించింది. మూడు రిజర్వాయర్లను ఒకేపనిగా చేపట్టి రూ.1,554,21,60,649 అంచనా వ్యయంతో జలవనరులశాఖ టెండర్లను నిర్వహించింది. టెండర్లలో ఎన్ఈసీఎల్, ఆర్ఆర్సీఐఐపిఎల్ జాయింట్ వెంచర్ సంస్థ రూ.1,553.96 కోట్లకే పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనితో ప్రభుత్వానికి రూ.64.76 కోట్లు ఆదా అయ్యింది.
అతిపెద్ద రిజర్వాయర్ ఇదే…
ప్రస్తుత చిత్తూరుజిల్లాలో ఉన్నవి రెండే రిజర్వాయర్లు. చిత్తూరువద్ద ఎన్టీఆర్ జలాశయం ఉండగా దీని నీటినిల్వ సామర్థ్యం 109.17 ఎంసీఎఫ్టీలు. కార్వేటినగరం మండలంలో కృష్ణాపురం జలాశయం నీటినిల్వ సామర్థ్యం 199:27 ఎంసీఎఫ్టీలు. అంటే ఒక టీఎంసీలో నాలుగో వంతు సామర్థ్యం కూడా లేదు. అవులపల్లె వద్ద నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 3.5 టీఎంసీలు. అంటే ఉమ్మడిచిత్తూరుజిల్లాలోని అన్ని ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యం కలుపుకొన్నా దీనికి తక్కువే.
గ్రావిటి ద్వారా నీటి తరలింపు…
ఆవులపల్లె రిజర్వాయర్ పూర్తయ్యాక గ్రావిటి ద్వారా కృష్ణా జలాలను తరలించాలన్నది ఇప్పటిదాక ఉన్న ప్రతిపాదన. హంద్రీనీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 210.00 వద్ద నీటిని రిజర్వాయర్కు గ్రావిటీ ద్వారా తరలించి నింపుతారు. దీనికింద కొత్తగా 40వేల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. మరో 20వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. అలాగే రిజర్వాయర్ నుంచి పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చే స్తారు. వైఎస్సార్జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు తరలించి అక్కడి నుంచి అన్నమయ్యజిల్లాలోని హంద్రీ-నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువకు అనుసంధానం పనులు సాగుతున్నాయి. ఈ అనుసంధాన పథకం ద్వారా కృ-ష్ణా జలాలను పుంగనూరు ఉపకాలువ నుంచి ఆవులపల్లె రిజర్వాయర్కు తరలించి నింపుతారు.
మంత్రి పెద్దిరెడ్డి కృషి ఫలితం…
ఆవులపల్లె , నేతిగుట్లపల్లె రిజర్వాయర్ల నిర్మాణాలు రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్రెడ్డి కృషి ఫలితమే ఆవులపల్లె , నేతిగుట్లపల్లె రిజర్వాయర్లు మంజూరుకు సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలకు శాశతంగా తాగునీటి సమస్య తీర్చడం, ఆయకట్టు భూములకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు కోసం మంత్రి ప్రతిపాదించారు. దీనితో నీటి ప్రాజెక్టు కల సాకారం అవుతోంది.
Tags: The embodiment of water! – Minister Dr. Peddireddy Ramachandra Reddy